ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌:సెప్టెంబర్ 15
తెలంగాణ గడ్డపై తొలిసారిగా రెండు రోజులు 16, 17 తేదీల్లో, హైదరాబాద్‌ వేదికగా తాజ్‌కృష్ణా హోటల్‌లో జరిగే ఈ కీలకమైన సీడబ్ల్యూసీ సమావేశాలకు.. కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో పాటు..

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, , ముఖ్యమంత్రులు, ఏఐసీసీ ప్రధాన కార్యర్శులు, కేంద్ర మాజీ మంత్రులు, ఇతర సీనియర్లతో కలిపి దాదాపుగా 200 మందికి పైగా ప్రతినిధులు సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరుకానున్నారు.

ఇప్పటీ వరకు ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం వార్‌రూమ్‌లో జరిగే ఈ సమావేశం.. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుండటంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

పార్టీ అగ్రనాయకత్వం అంతా రాష్ట్రానికి రావడం, కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నతంగా భావించే సీడబ్ల్యూసీ సమావేశాలు తెలంగాణలో నిర్వహిస్తుండటంతో.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంది. ఏమాత్రం లోటుపాట్లు లేకుండా పకడ్బందిగా ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో వీఐపీకి పీసీసీ నుంచి ఒక డెలిగెట్‌ను ఏర్పాటు చేశారు. ఏయిర్‌పోర్టు నుంచి దిగినప్పటికి నుంచి సమావేశానికి హాజరకావడం, తిరిగి వెళ్లే వరకు పీసీసీ కేటాయించిన నాయకులు చూసుకునే విధంగా కార్యాచరణ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో కాంగ్రెస్‌ అధిష్టానం ఏఐసీసీ ప్లీనరీని నిర్వహించింది.

దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొదటిసారిగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఇప్పుడు హైదరాబాదులో నిర్వహిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *