యాద్రాది భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది బొడ్డుగూడెం గ్రామ శివారులో ఆర్టిసి బస్సు బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు.
ఈ ప్రమాదంలో పది మంది గాయపడినట్టు సమాచారం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు తొర్రూరు నుండి జగదిరిగుట్ట వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది మృతులు చుక్క యాకమ్మ (50), కొండ రాములు (60)గా గుర్తించారు.