తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుపతి :సెప్టెంబర్ 27
తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గింది.

నేడు బుధవారం శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం తిరుమల శ్రీవారిని 55,747 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

శ్రీవారికి 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *