నేడు టెట్’ పరీక్ష: సర్వం సిద్ధం చేసిన అధికారులు

హైదరాబాద్:సెప్టెంబర్ 15
టీచర్ ఎలిజిబులిటీ టెట్ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది.

మొత్తం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా పేపర్ 1 కు 2,69,557 మంది, పేపర్ 2కు 2,08,498 మంది అప్లికేషన్ చేసుకున్నారు.

పేపర్ 1 నిర్వహణకు 1139 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. పేపర్ 2కు 913 సెంటర్లు సిద్ధం చేశారు. మొత్తం 2052 కేంద్రాలకు గాను 2052 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2052 మంది డిపార్ట్ మెంటల్ ఆఫీసర్లు, 22,572 మంది ఇన్విజిలేటర్లు, 10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను అధికారులు నియమించారు.

నిఘా నీడలో పరీక్షలు నిర్వహించనున్నారు. పారదర్శకంగా నిర్వహించేందుకే సీసీ టీవీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టంచేశారు. కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. వైద్యం, రవాణాకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *