శ్రావణ శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది!!

తిరుపతి: సెప్టెంబర్ 15
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు చివరి శ్రావణ శుక్రవారం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంది.

నేడు శ్రీవారి దర్శనానికి 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కాగా గురువారం స్వామివారిని 61,926 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *