ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా…

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఎలక చెట్టు వద్ద ప్రమాదవశాత్తు ఆర్టీసీ ఇంద్ర బస్సు బోల్తా పడింది.

హైదరాబాద్ నుండి మార్కాపురం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయని సమాచారం.

గాయపడ్డ ప్రయాణికులను హుటాహుటిన 108 లో యర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *