ములుగు జిల్లాలో లారీని ఢీ కొట్టిన కారు: విద్యార్థి మృతి

ములుగు జిల్లా:
ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్‌ లైటింగ్‌ పోల్‌ను ఢీకొట్టడంతో ఆగివున్న లారీ కిందకు దూసుకెళ్లింది. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని దుర్మరణం చెందగా.. మిగిలిన ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియవలసి ఉంది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *