2000 నోటు మార్పిడికి ఇక మిగిలింది ఐదురోజులే!

 

హైదరాబాద్:
రెండువేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన గడువు మరో ఐదురోజుల్లో ముగియనుంది.

ఈనెల 30వ తేదీ వరకు రెండువేల నోట్లు మార్పిడి చేసుకోవల్సి ఉంది. పెద్దనోట్‌గా కొనసాగిన రెండువేల నోట్లను మే 19వ తేదీన ఆర్బీఐ రద్దు చేసింది. నోట్లు ఉన్న వారిని ఉపసంహరించుకునేందుకు ఈనెల 30వ తేదీవరకు గడువిచ్చింది.

ఇప్పటికే చాలామంది నోట్లు మార్పిడి చేసుకున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటేమాత్రం ఐదురోజుల్లో మార్పిడి చేసుకోవల్సి ఉంటుంది. ఐదురోజుల్లో ఒకరోజు సెలవు ఉంది.

ఈనెల 28న గణేష్‌ నిమజ్జనం ఉన్నందునా బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. దీంతో ఆ రోజు బ్యాంకుల్లో రెండువేల నోట్లు మార్పిడి చేసుకునేందుకు వీలు లేదు. 29,30 తేదీల్లో నోట్లు మార్పిడి చేసుకోవల్సి ఉంటుంది.

చివరి రెండురోజుల్లో బ్యాంకుల్లో సందడి నెలకొనే ప్రమాదం లేకపోలేదు..ఎవరి దగ్గరైనా రెండువేల నోట్లు మిగిలిపోతే మాత్రం జాగ్రత్తపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రెండువేల నోట్ల ఉపసంహరణకు సంబంధించిన గడువు ఐదురోజుల్లో ముగియనున్నందునా గడువు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *