హిందూ ముస్లిం పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి:డిసిపి వైభవ్

పెద్దపల్లి జిల్లా:సెప్టెంబర్ 14
హిందూ ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మూన్ ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జోన్ పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతూ…

రాబోయే వినాయక చవితి, మిలాద్ ఉన్ నబి వేడుకలను హిందూ, ముస్లింలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు కచ్చితంగా పోలీస్ శాఖ అనుమతి పొందాలన్నారు.

మండపం వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, సిఐ అనిల్, జగదీష్, సత్య నారాయణ, చంద్ర శేఖర్, ప్రమోద్ రావు, ప్రసాద్, ఎస్ఐ లు మహేందర్, మల్లేష్ తో పాటు శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *