కాటేజీ వివాదం – టీటీడీ బోర్డుకు జంగా రాజీనామా !

టీటీడీ పాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదిచాలని కోరారు. జంగా కృష్ణమూర్తి తిరుమలలో ఒక కాటేజీని నిర్మించాలనుకున్నారు. ఇటీవల ఆయన కాటేజీకి బోర్డు అనుమతి ఇచ్చింది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యతిరేకత కథనం వచ్చింది. ఆయనకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని .. ఇలా కాటేజీకి అనుమతి ఇవ్వడాన్ని బీజేపీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి వ్యతిరేకించారని చెప్పింది. ఈ అంశం వివాదాస్పదం కావడంతో కాటేజీ నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఈ వివాదం కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *